Women U-19 T20 WC : మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ (Women U-19 T20 WC) లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ (India) జోరు కొనసాగుతోంది. భారత యువ మహిళలు వరుస విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్లలో గెలిచిన భారత్.. ఆదివారం సూపర్ సిక్స్ (Super Six) గ్రూప్-1లో బంగ్లాదేశ్ (Bangaldesh) తో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి బంగ్లాను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టును భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగుల వద్ద కట్టడి చేసింది. బంగ్లా బ్యాటర్లలో సుమైయా అక్తర్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్కు దిగిన ఇండియా కేవలం 7.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 31 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లతో 40 పరుగులు రాబట్టి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది.
జట్టు విజయానికి చేరువైన దశలో త్రిష ఔటయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిక్కీ ప్రసాద్ (5 నాటౌట్) విన్నింగ్ షాట్ కొట్టింది. భారత్ తదుపరి మ్యాచ్లో స్కాట్లాండ్తో తలపడనుంది. బంగ్లా బ్యాటర్లలో సుమైయా అక్తర్ (21 నాటౌట్) మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో వైష్ణవీ శర్మ 3 వికెట్లు, షబ్నమ్, జోషిత, త్రిష తలా ఒక వికెట్ పడగొట్టారు.
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?
BJD | రాష్ట్రస్థాయి కమిటీలన్నీ రద్దు చేసిన బిజూ జనతాదళ్.. ఎందుకంటే..!
Shubman Gill | ఒత్తిడివల్లే సరిగా ఆడలేకపోయా.. వైఫల్యంపై నిజం ఒప్పుకున్న గిల్
Republic Day 2025 | ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు.. Videos
Health tips | రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్లా కరిగిపోతుంది తెలుసా..?