ముంబై: ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్.. ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జెర్సీ వేసుకున్నాడు. 2021 ఐపీఎల్ సీజన్కు ముందు ఆ టీమ్ను చీర్ చేశాడు. ఆ ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ను ట్యాగ్ చేశాడు. చాలెంజర్స్.. ఇప్పటికే అత్యంత వేగంగా పరుగెత్తే వాడిని నేనే అని మరోసారి మీకు గుర్తు చేస్తున్నా అని బోల్ట్ కామెంట్ చేశాడు.
దీనికి కోహ్లి, డివిలియర్స్ కూడా స్పందించారు. అందులో డౌటే లేదు.. అందుకే నిన్ను మా టీమ్లోకి తీసుకున్నాం అని కోహ్లి ట్వీట్ చేశాడు. అటు డివిలియర్స్ స్పందిస్తూ.. మాకు కొన్ని అదనపు పరుగులు కావాల్సిన టైమ్లో ఎవరిని పిలవాలో మాకు తెలుసు అని ట్వీట్ చేయడం విశేషం. ఆర్సీబీ టీమ్ కూడా బోల్ట్ ట్వీట్పై స్పందించింది. ఇక ఇండియా ఫ్లైట్ ఎక్కడే తరువాయి అని ఆ టీమ్ ట్వీట్ చేసింది.
Challengers, just letting you know, I’m still the fastest cat around. @imVkohli @ABdeVilliers17 @pumacricket @RCBTweets pic.twitter.com/cIz3dmW3uI
— Usain St. Leo Bolt (@usainbolt) April 7, 2021
No doubt and that's why we've got you on our team now 🙌 @usainbolt @pumacricket https://t.co/1k3ZkTozR5
— Virat Kohli (@imVkohli) April 7, 2021
We know whom to call when we need a few extra runs! 👀 @usainbolt @pumacricket https://t.co/ND228P7yCD
— AB de Villiers (@ABdeVilliers17) April 7, 2021