బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే మూవీ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ రంజాన్కే మూవీ రిలీజ్ అవుతోందని తెగ సంబరపడ్డారు. అయితే సల్లూ భాయ్ మాత్రం వాళ్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాధేను వచ్చే ఏడాది రంజాన్కే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అతడు చెప్పాడు. నిజానికి ఈ మూవీ గతేడాది రంజాన్కే రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి వల్లే రిలీజ్ను ఈ ఏడాదికి వాయిదా వేశారు. మే 13న రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
రాధే రిలీజ్పై సల్మాన్ ఏమన్నాడు?
ఈ మధ్య జరిగిన ఓ బుక్ లాంచ్లో రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ మూవీ రిలీజ్పై సల్లూ భాయ్ మాట్లాడాడు. రాధేను ముందే రిలీజ్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ మూవీని ఈద్కు రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ లాక్డౌన్ ఇలాగే కొనసాగితే మాత్రం రిలీజ్ను వచ్చే ఈద్కు వాయిదా వేయాల్సి రావచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాలి అని సల్మాన్ చెప్పాడు. అలా చేస్తే కొవిడ్ రెండో దశ త్వరలోనే సమసిపోతుందని, తన మూవీ రిలీజ్ అవుతుందని అన్నాడు. లాక్డౌన్ల వల్ల రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆ పరిస్థితి రాకుండా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలనీ సూచించాడు. మూవీ రిలీజ్ కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని సల్మాన్ స్పష్టం చేశాడు. దేవుడి దయ ఉంటే ఈ ఈద్కే రాధే రిలీజ్ అవుతుందని కూడా అతడు అన్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. సౌత్ కొరియా సినిమా అవుట్లాస్కు రీమేక్.