Sanju Samson : ఉప్పల్ స్టేడియంలో బౌండరీల వర్షం కురింపించి.. తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీతో గర్జించిన సంజూ శాంసన్ (Sanju Samson) ఇన్నింగ్స్ను ఇప్పట్లో అభిమానులు మర్చిపోలేరు. తుఫాన్లా బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డ శాంసన్ 40 బంతుల్లోనే శతకం బాదేసి పొట్టి క్రికెట్లో తన మేనియా చూపించాడు. ఐపీఎల్ నుంచి టీ20ల్లో వీరబాదుడుకు కేరాఫ్ అయిన సంజూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించాడు.
వెస్టిండీస్లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో తనకు కొద్దిలో ఫైనల్ ఆడే అవకాశం చేజారిందని తెలిపాడు. నేను తుది జట్టులో ఉంటానని నమ్మాను. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆఖరి 10 నిమిషాల్లో అంతా మార్చేశాడు అని శాంసన్ జూన్ 30వ తేదీన ఏం జరిగిందో వివరించాడు.
🚨🚨 Sanju Samson was all set to play in XI of T2OI WC Final as Rohit had told him the morning of final but at toss Rohit Sharma announced the same XI and in return he got “duck” from Rishabh Pant.
Rohit then talked to Samson after toss for over 10 minutes and apologized. I… pic.twitter.com/lxGa0f7DsB
— Rajiv (@Rajiv1841) October 21, 2024
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నప్పటికీ శాంసన్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. తీరా ఫైనల్లో అవకాశం వస్తుందనుకుంటే అదీ కాలేదు. అసలు.. జూన్ 30వ తేదీన ఏం జరిగిందో శాంసన్ మాటల్లోనే.. ‘బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఫైనల్. ఆ మ్యాచ్లో నేను ఉంటాను అనుకున్నా. కోచ్, కెప్టెన్ కూడా రెడీగా ఉండు అని చెప్పారు. అందుకని నేను మానసికంగా సిద్ధంగా ఉన్నారు. అయితే.. ఏమైందో తెలియదు టాస్కు ముందు నిర్ణయం మార్చుకున్నారు. సెమీస్ ఆడిన జట్టునే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అయినా సరే ఏమీ బాధపడొద్దని నాకు నేను చెప్పుకున్నా. వామప్ సమయంలో రోహిత్ నా దగ్గరికి వచ్చాడు.
పక్కకు తీసుకెళ్లి ఎందుకు నన్ను తీసుకోలేదో వివరించాడు. ‘అర్ధమైందా సంజూ” అని హిట్మ్యాన్ నాతో అనగానే.. ఓకే. మనం ఎలాగైనా మ్యాచ్ గెలవాలి. ఆ తర్వాత మాట్లాడుదాం. ‘మీరు ఆట మీద దృష్టి పెట్టండి’ అని రోహిత్కు చెప్పాను. ఆ తర్వాత రెండు నిమిషాలకే రోహిత్ మళ్లీ నా వద్దకు వచ్చి.. ”నువ్వు మనసులో నన్ను శపిస్తున్నావని నాకు తెలుసు. నీవు సంతోషంగా లేవని అనుకుంటున్నా’ అని అన్నాడు. అందుకు నేను అవును.. ఒక ఆటగాడిగా.. నాకు ఫైనల్ ఆడాలని ఉంటుందిగా అని బదులిచ్చాను’ అని సంజూ ఆ రోజు కెప్టెన్తో జరిగిన సంభాషణను వెల్లడించాడు. అంతేకాదు రోహిత్ శర్మ వంటి నాయకుడి నేతృత్వంలో ఒక్కటంటే ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడలేకపోయానని, ఆ బాధ తనకు జీవితాంతం ఉంటుందని శాంసన్ వాపోయాడు.
దక్షిణాఫ్రికాతో బార్బడోస్లో జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ(76) అర్ధ శతకంతో మెరిశాడు. అనంతరం పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2/18) తన మ్యాజిక్ చూపిస్తూ సఫారీల నడ్డి విరిచాడు. దాంతో, ఉత్కంఠ పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
177 పరుగుల ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్(52), క్వింటన్ డికాక్(39)ల విధ్వసంక బ్యాటింగ్తో భయపెట్టినా.. హార్దిక్ పాండ్యా సూపర్ ఓవర్తో జట్టును గెలుపు వాకిట నిలిపాడు. బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్తో మిల్లర్ ఔట్ కాగా.. టీమిండియా విజయం ఖరారైంది. 2007లో ధోనీ సారథ్యంలో చాంపియన్గా నిలిచిన భారత్.. 17 ఏండ్ల తర్వాత మళ్లీ పొట్టి కప్ను ముద్దాడింది.