‘సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు ఓ రేంజ్లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి. ప్రతిచోటా షోలు పెరుగుతున్నాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయి, విజయం వైపు సినిమా దూసుకుపోతున్నది. నన్నంతా ఫ్యామిలీ హీరో అంటున్నారు. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని హీరో తిరువీర్ అన్నారు. ఆయన, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ..!సుకుమారి’.
భరత్దర్శన్ దర్శకత్వంలో మహేశ్వరరెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో హీరో తిరువీర్ మాట్లాడారు. మౌత్ టాక్ బావుందని, కొంత సమయం ఇస్తే ఈ సినిమా ఇంకా పుంజుకుంటుందని, రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉందని అంతా ప్రశంసిస్తున్నారని దర్శకుడు భరత్ దర్శన్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత మహేశ్వర్రెడ్డి, క్రాంతి, డీవోపీ కుషేందర్, నటుడు అంజిమామ కూడా మాట్లాడారు.