న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో సంచలనాలు నెలకొల్పుతున్న క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ద్వారా హవాలా లావాదేవీలు జరిపినట్లు జింబాబ్వే టీం మాజీ కెప్టెన్ హీట్ స్ట్రీక్ అంగీకరించారు. మ్యాచ్ ఫిక్సింగ్లో బుకీలు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ను వాడుకుంటున్నారని, దీన్ని ఎదుర్కోవడం తమకు చాలెంజ్ అని ఐసీసీ ఇంటిగ్రిటీ హెడ్ అలెక్స్ మార్షల్ పేర్కొన్నారు.
జింబాబ్వే, బంగ్లాదేశ్లతోపాటు ఐపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ల్లో తన కోచింగ్ స్టింట్స్ విషయాన్ని ఒక ఇండియన్ బుకికి వెల్లడించినట్లు స్ట్రీక్ అంగీకరించారు. దీంతో ఆయనపై ఐసీసీ ఎనిమిదేండ్ల నిషేధం విధించింది.
ఇప్పటివరకు మ్యాచ్ ఫిక్సింగ్లకు పాల్పడిన వారికి బుకీలు క్యాష్, కార్లు, ఆభరణాలు, హై ఎండ్ ఫోన్లను గిఫ్ట్లుగా బహుకరించేవారు. ఇప్పుడు బిట్ కాయిన్లను చెల్లిస్తున్నారని స్ట్రీక్ చేసిన వ్యాఖ్యతో తేలిపోయింది. 2018లో అప్పటి విలువ ప్రకారం స్ట్రీక్ రెండు బిట్ కాయిన్లు తీసుకున్నారు. మొత్తం వాటి విలువ 35 వేల డాలర్లు.
మ్యాచ్ ఫిక్సింగ్లో బిట్ కాయిన్ రూపంలో హవాలా లావాదేవీలు జరుగడం నూతన పరిణామం అని అలెక్స్ మార్షల్ చెప్పారు. అయితే, దీన్ని దర్యాప్తు చేయగల సామర్థ్యం తమ సిబ్బందికి ఉందన్నారు.
బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ నూతన అధినేత షబ్బీర్ హుస్సేన్ షేఖాదాం ఖండ్వవాలా స్పందిస్తూ.. బిట్ కాయిన్ రూపంలో హావాలా లావాదేవీలు జరుగుతున్నాయని వినడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. హీత్ స్ట్రీక్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు. అయితే, అవినీతి పరులు తమ లావాదేవీలపై అలర్ట్గా ఉండబోరన్నారు.
కొవిడ్పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ
‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్
వాట్సాప్లో ఈ ట్రిక్స్ తెలుసా?
బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం
ఫ్లిప్కార్ట్ చేతికి క్లియర్ ట్రిప్
ఆదాయంలో అంచనాలు దాటిన విప్రో
ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు