సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.
సిరిసిల్ల: సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.
ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద రూ.80 కోట్లతో నిర్మించిన 1,320 డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు పట్టాలు అందిస్తారు.
మధ్యాహ్నం 12.20 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో 20 ఎకరాల్లో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12.45 గంటలకు సిరిసిల్లలో రూ.36 కోట్లతో ఐదెకరాల్లో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 1.10 గంటలకు సిరిసిల్ల మండలం సర్ధాపూర్లో రూ.22 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 1.40 గంటలకు 82 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (కలెక్టరేట్) భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.