లక్నో: ఒక వేడుకలో పాల్గొన్న కొందరు వ్యక్తులు క్రేన్పైకి ఎక్కారు. ఒక విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించారు. అయితే అధిక బరువు వల్ల ఆ క్రేన్ కూలింది. (Crane Falls) క్రేన్ ఉన్న వాహనం కూడా ఒక పక్కకు ఒరిగిపోయింది. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో ఈ సంఘటన జరిగింది. గురువారం మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా కర్హల్ చౌక్ వద్దకు రాజ్పుత్ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ వర్గం నేతలు క్రేన్పైకి ఎక్కారు. ఆ చౌక్లోని మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూల మాలలు వేసేందుకు ప్రయత్నించారు.
కాగా, క్రేన్పైకి ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడంతో ఉన్నట్టుండి అది కూలిపోయింది. ఆ క్రేన్ అమర్చిన వాహనం కూడా ఒక పక్కకు ఒరిగిపోయింది. అయితే అప్రమత్తమైన జనం అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP : मैनपुरी में राजपूत सभा के लोग क्रेन पर चढ़कर महाराणा प्रताप की प्रतिमा पर माल्यार्पण कर रहे थे। अचानक क्रेन गिर गई। हालांकि कोई चोटिल नहीं हुआ है।
इसी प्रतिमा पर 4 दिन पहले सपाई पहुंचे थे। जिसके बाद भाजपाइयों ने उस जगह को गंगाजल से धोया था। pic.twitter.com/rtXn4MQEU1
— Sachin Gupta (@SachinGuptaUP) May 9, 2024