Beth Mooney : భారత గడ్డపై జరుగుతున్న ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా మహిళల జట్టు(Australia Womens Team) పోరాడుతోంది. మూడో రోజు తొలి సెషన్ మొదలైన కాసేపటికే భారత్ను 406 ఆలౌట్ చేసిన కంగారూ జట్టు.. రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది. టీమిండియా ఆధిక్యం 187 పరుగులు ఉండడంతో ఓపెనర్ బేత్ మూనీ(33 : 37 బంతుల్లో 7 ఫోర్లు) బౌండరీలతో విరుచుకుపడింది. అయితే.. లంచ్ బ్రేక్కు ముందు జట్టు స్కోర్ 49 వద్ద మూనీ ఊహించిన విధంగా రనౌట్ అయింది.
స్నేహ్ రానా వేసిన బంతిని సిల్లీ పాయింట్ దిశగా ఆడిన మూనీ రిలాక్స్ అవుదామనుకొని క్రీజు దాటింది. కానీ, అక్కడే కాచుకొని ఉన్న రీచా ఘోష్(Rich Ghosh) రెప్పపాటులో బంతిని వికెట్లపైకి విసిరింది. అది గమనించిన మూనీ అప్రమత్తమైన ఆసీస్ ఓపెనర్ బ్యాటును క్రీజులో పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ, అప్పటికే బంతి వికెట్లను గిరాటేసింది. దాంతో, మూనీ నిరాశగా పెవిలియన్ బాట పట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభం ఉన్న మూనీ ఇలా రనౌట్ కావడం క్రికెట్ పండితుల్ని విస్మయానికి గురి చేస్తోంది.
𝙍𝙐𝙉-𝙊𝙐𝙏! 🎯
How about that for game awareness 👌 👌
That was brilliant from Richa Ghosh 🙌 🙌
Follow the Match ▶️ https://t.co/8qTsM8XSpd #TeamIndia | #INDvAUS | @13richaghosh | @IDFCFIRSTBank pic.twitter.com/c3O3O249DA
— BCCI Women (@BCCIWomen) December 23, 2023
సొంత గడ్డపై ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియా భరతం పడుతోంది. ముంబైలోని వాంఖడేలో కంగారూలతో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్లో 219కే కంగారూలను ఆలౌట్ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ సేన.. అనంతరం 406 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.
స్మృతి మంధానా(74), దీప్తి శర్మ(78)
ఆల్రౌండర్ దీప్తి శర్మ(78), స్మృతి మంధానా(74), జెమీమా రోడ్రిగ్స్(73), రీచా ఘోష్(52) హాఫ్ సెంచరీలు బాదడంతో భారత్.. ఆస్ట్రేలియాపై రికార్డు స్కోర్ నమోదు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ను తహ్లియా మెక్గ్రాత్(68 నాటౌట్), అలిసా హేలీ(15 నాటౌట్) ఆదుకున్నారు. వీళ్లు నాలుగో వికెట్కు 51 పరుగులు జోడించారు. దాంతో, ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది.