న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 పార్ట్ -2 నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన మ్యాచ్లను ఇప్పుడు యూఏఈలో నిర్వహించనున్నారు. భారతదేశంలో 29 మ్యాచ్లు నిర్వహించగా.. ఇప్పుడు మిగిలిన 31 మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. ఐపీఎల్ పార్ట్-వన్ సమయంలో బయోబబుల్లో క్రికెటర్లు ఉండాల్సి వచ్చింది. అయితే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ ఆలోచన చేస్తున్నది. మిగిలిపోయిన మ్యాచ్లను సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడానికి బోర్డు తన వంతు ప్రయత్నం చేస్తున్నది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పార్ట్-టూ ఐపీఎల్ కోసం బీసీసీఐ ఒక షాకింగ్ రూల్ (IPL New Rule) తీసుకొచ్చింది. యూఏఈలో జరిగే మ్యాచ్ల కోసం బీసీసీఐ 46 పేజీల ఆరోగ్య సలహాలు తీసుకొచ్చింది.
ఇన్సైడ్ స్పోర్ట్స్లో ప్రచురించబడిన వార్త ప్రకారం, ఎవరైనా ఆటగాడె బంతిని స్టాండ్లోకి సిక్స్గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించరు. ఆ బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకొస్తారు. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున.. తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉన్నది. అందుకని స్టాండ్కు వెళ్లే బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచనున్నారు. ఈసారి ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. రెండో విడత ఐపీఎల్ మ్యాచులు వచ్చే నెల 19 నుంచి అక్టోబర్ 15 వరకు జరుగనున్నాయి.
నీరజ్ను అభినందిస్తూ గవాస్కర్ పాట
కువైట్ టైర్ డంప్ యార్డ్లో అగ్నిప్రమాదం
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్..!
రైతు ఉద్యమంలో చీలిక.. గుర్నామ్సింగ్ సస్పెండ్
నీరజ్కు అభినందనలు.. ఈరోజు ఆటో రైడింగ్ ఫ్రీ
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..