లండన్ : రకరాల టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటంతో డిజిటల్ ప్రపంచం నానాటికి పెరిగిపోతున్నది. అత్యాధునిక మొబైల్ ఫోన్ టెక్నాలజీ (Digital Expenditure) చేతిలోకి రావడంతో వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నెలవారీగా ఎంత ఖర్చు అయినా పర్వాలేదంటున్నారని బ్రిటన్కు చెందిన ‘మనీ సూపర్మార్కెట్’ అనే సంస్థ తమ పరిశోధనలో తేల్చింది. ఇదే సమయంలో, పిల్లలు 16 ఏండ్ల వయసు వచ్చే నాటికి టెక్నాలజీపై తల్లిదండ్రులు ఏకంగా రూ.41 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా స్పష్టం చేశారు.
ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయాడానికైనా వెనుకాడటం లేదు. రెండేండ్ల క్రితం పిల్లలు 16 ఏండ్ల వయసు వచ్చే వరకు రూ.10,000 వేలు ఖర్చు చేసేవారు. కాగా, ప్రస్తుతం ఆ మొత్తం రూ.41 లక్షలకు చేరుకున్నదని ‘మనీ సూపర్మార్కెట్’ సర్వేలో తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఖర్చు మరింత పెరిగిందంట. తమ పిల్లలు బాగా చదువుకోవాలన్న ఆశతో ఖర్చుతో కూడుకున్న టెక్నాలజీని అందివ్వడానికి ముందుకొచ్చారని వీరి సర్వేలో బయటపడింది.
బడికి పోయే వయసున్న పిల్లలు ఉన్న దాదాపు 2,000 మంది తల్లిదండ్రులతో ఈ సర్వే చేపట్టారు. సర్వే నివేదిక ప్రకారం, 77 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారు. కాగా, 17 శాతం మంది తల్లిదండ్రులు ఖరీదైన టెక్నాలజీని కొనుగోలు చేయాలనే ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఖరీదైన టెక్నాలజీతోపాటు దుస్తులు, ఆహారం, పాకెట్మనీ కోసం మరో రూ.16 లక్షలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. బ్రిటన్లో చిన్నారుల విద్య కోసం ఖర్చు చేయడానికి తల్లిదండ్రులు చాలా ఒత్తిడిలో ఉన్నారని ‘మనీ సూపర్మార్కెట్’కు చెందిన సాషా ఎవాన్స్ తెలిపింది.
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్..!
రైతు ఉద్యమంలో చీలిక.. గుర్నామ్సింగ్ సస్పెండ్
నీరజ్కు అభినందనలు.. ఈరోజు ఆటో రైడింగ్ ఫ్రీ
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
లండన్లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమంటా..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..