టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో పసిడిని ఒడిసి పట్టుకున్న నీరజ్ చోప్రాకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, సంస్థలు బహుమతుల జడివానలో ముంచెత్తుతుండగా.. మాజీ క్రికెటర్ గవాస్కర్, టెన్నీస్ ప్లేయర్ సోమ్దేవ్ పాటతో నీరజ్ను అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీరజ్ చోప్రా జస్ట్ 20 ఇయర్ ఓల్డ్.. అనే లిరిక్తో ప్రారంభమైన ఈ పాటను గవాస్కర్ (Gavaskar song) , సోమ్దేవ్ దేవ్వర్మన్తో మరికొందరు గొంతు కలిపారు.
ఒలింపిక్స్లో 121 ఏండ్ల చరిత్రను తిరగారాస్తూ నీరజ్ బంగారు పతకాన్ని సాధించడం అత్యంత ఆనందమయమైన క్షణాలని, అందుకే నీరజ్ను పొగుడుతూ ప్రత్యేక గీతాన్ని విడుదల చేయాలని సోమ్దేవ్ డిసైడ్ అయ్యాడని గవాస్కర్ చెప్పారు. మేమంతా సోమ్దేవ్తో గొంతుకలిపి మద్దతుగా నిలిచి ఈ గీతాన్ని షేర్ చేశామన్నారు. నీరజ్ను పొగుడుతూ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నీరజ్ రాకెట్లాంటోడు.. నన్ను ఎంతో సంతోషపడేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ సెహ్వాగ్ రాశారు.
నీరజ్కు అభినందనలు తెలిపిన చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) జట్టు యాజమాన్యం.. అతడికి రూ.కోటి నజరాన ప్రకటించారు. నీరజ్ పేరుతో ప్రత్యేక జెర్సీని తయారుచేయించి.. దానికి నీరజ్ రికార్డుకు గుర్తుగా 8758 అని నంబర్ ఇవ్వనున్నట్లు సీఎస్కే ప్రకటించింది. నీ కారణంగానే దేశం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది అని సచిన్.. నీరజ్ను ప్రశంసల్లో ముంచెత్తారు. సూర్యుడి వైపుగా జావెలిన్ విసిరి భారత్కు బంగారు పతకాన్ని తీసుకొచ్చాడని సచిన్ తన అభినందనలు తెలిపారు. వీరే కాకుండా అభినవ్ భింద్రా, పీటీ ఉష, పీవీ సింధూ, మీరాబాయి చాను, సైనా నెహ్వాల్, రిషబ్ పంత్ తదితరులు ట్విట్టర్ వేదికగా నీరజ్ను ప్రశంసల్లో ముంచెత్తారు.
కువైట్ టైర్ డంప్ యార్డ్లో అగ్నిప్రమాదం
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్..!
రైతు ఉద్యమంలో చీలిక.. గుర్నామ్సింగ్ సస్పెండ్
నీరజ్కు అభినందనలు.. ఈరోజు ఆటో రైడింగ్ ఫ్రీ
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..