Nethra Kumanan | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు యువ సెయిలర్ నేత్రా కుమానన్ అర్హత సాధించింది. ఫ్రాన్స్ వేదికగా జరిగిన చివరి ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో మహిళల డింగీ(ఐఎల్సీఏ6) విభాగంలో బరిలోకి దిగిన నేత్ర 67 పాయింట్లతో ఓవరాల్గా ఐదో స్థానంలో నిలిచింది.
ఎమర్జింగ్ నేషన్స్ ప్రోగ్రామ్(ఈఎన్పీ) కింద జరిగిన ఈ టోర్నీలో నేత్ర అద్భుత ప్రదర్శన కనబరిచింది.