Athletics Championship | దుబాయ్: ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ పతక జోరు దిగ్విజయంగా సాగుతున్నది. శనివారంతో ముగియనున్న టోర్నీలో భారత్ ప్రస్తుతం ఐదు స్వర్ణాలు సహా ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది.
శుక్రవారం జరిగిన మహిళల 800మీటర్ల రేసులో లక్షిత వినోద్ 2:07:10 సెకన్ల టైమింగ్తో రజత పతకం ఖాతాలో వేసుకుంది. మరోవైపు మహిళల 400మీటర్ల హార్డిల్స్లో శ్రియా రాజేశ్ కాంస్యం ఖాతాలో వేసుకుంది.