Ranji Trophy 2024 : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024) తుది అంకానికి చేరింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఎనిమిది జట్లు క్వార్టర్కు అర్హత సాధించాయి. నాలుగు ఎలైట్ గ్రూప్స్ (Elite Groups) నుంచి ముంబై, విదర్భ, కర్నాటక, బరోడా, తమిళనాడు, సౌరాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రా జట్లు నాకౌట్ బెర్తు దక్కించుకున్నాయి. దాంతో, మంగళవారం బీసీసీఐ(BCCI) క్వార్టర్ ఫైనల్ తేదీలను ప్రకటించింది.
ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు క్వార్టర్స్ మ్యాచ్లు నిర్వహించనున్నట్టు తెలిపింది. సెమీస్ బెర్తు కోసం ఈ చాంపియన్ జట్ల మధ్య తగ్గపోరు ఖాయమనిపిస్తోంది. నాగ్పూర్లోని వీసీఏ సివిల్ లైన్స్ స్టేడియం తొలి క్వార్టర్ ఫైనల్కు ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్లో రెండుసార్లు చాంపియన్ విదర్భ, 8 సార్లు విజేత కర్నాటకను ఢీకొననుంది.
Presenting the Quarter-finalists of the @IDFCFIRSTBank #RanjiTrophy 🙌
Which team are you rooting for 🤔
🗓️ 23rd to 27th February
📺 @JioCinema
💻📱 https://t.co/pQRlXkCguc pic.twitter.com/0tByOrXvFz— BCCI Domestic (@BCCIdomestic) February 19, 2024
రంజీల్లో తిరుగులేని ముంబైకి రెండో క్వార్టర్స్ పోరులో ఐదు సార్లు చాంపియన్ బరోడా జట్టు సవాల్ విసరనుది. ఈ మ్యాచ్కు ముంబైలోని బీకేసి గ్రౌండ్ వేదిక కానుంది. కోయంబత్తూర్లోని శ్రీ రామకృష్ణన్ కాలేజీ మైదానంలో జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు, సౌరాష్ట్ర జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి.
మధ్యప్రదేశ్ జట్టు
నాలుగో క్వార్టర్ పోరులో మధ్యప్రదేశ్, ఆంధ్రా తలపడనున్నాయి. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లను ఏ టీవీ ఛానెల్ టెలికాస్ట్ చేయడం లేదు. అయితే.. బీసీసీఐ టీవీతోపాటు జియో సినిమా యాప్, క్రిక్బజ్, ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో లైవ్ స్కోర్ తెలుసుకోవచ్చు.