Mallikarjun Kharge : రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుండటంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓటమి ఖాయమని, ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా రావని అన్నారు. బీజేపీ 400 లోక్సభ సీట్లను గెలుస్తుందని తాను చెప్పినట్టు ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని, కానీ ఆ పార్టీ 100 సీట్లను కూడా దాటదని వాస్తవంగా తాను చెప్పానని ఖర్గే పేర్కొన్నారు.
తాను పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడినా తన మైక్రోఫోన్ను స్విచాఫ్ చేస్తూ తన ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు అడ్డుతగులుతున్నారని ఆయన ఆరోపించారు. మోదీ నియంతలా మారారని, ఆయన మళ్లీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని, రాజ్యాంగం ఉనికే కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అంతకుముందు అమేథిలో జరిగిన రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న ఖర్గే మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
రైతులు, కార్మికులు, దళితులు, బీసీలు, గిరిజనులకు మోదీ ఎలాంటి గ్యారంటీ ఇవ్వరని దేశంలోని ఇద్దరు ముగ్గురు సంపన్న పారిశ్రామికవేత్తలకే మోదీ గ్యారంటీ లభిస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ స్నేహితుల రుణాలు దాదాపు రూ 13 లక్షల కోట్లు మాఫీ కాగా కేవలం రూ. 12,000 రూ. 13,000 రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఖర్గే అన్నారు. సంపన్నులపై విధించే పన్నులు తగ్గిస్తూ పేదలపై పన్ను రేట్లను పెంచుతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Maratha Reservation: 10 శాతం మరాఠా రిజర్వేషన్కు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం