WFI | న్యూఢిల్లీ: ఆట వ్యవహారాలను తిరిగి అడ్హాక్ కమిటీకి అప్పగించాలని చూస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)పై నిషేధం విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరికలు జారీ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాల్లో బయటి వ్యక్తుల లేదా సంస్థల ప్రమేయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని యూడబ్ల్యూడబ్ల్యూ తమ లేఖలో స్పష్టం చేసింది. ‘రెజ్లింగ్ వ్యవహారాలను మళ్లీ అడ్హాక్ కమిటీకి అప్పగించేందుకు క్రీడా శాఖ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇదే ఉత్పన్నమైతే సమాఖ్యపై సస్పెన్షన్ వేయడంతో పాటు వచ్చే నెలలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో పోటీపడకుండా భారత రెజ్లర్లపై నిషేధం విధి స్తాం’ అని యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు నెనాద్ లలవోవిచ్ పేర్కొన్నాడు.