Mallareddy | మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 27: కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. నాగారంలో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మోసమని, ఆ పార్టీ ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. పదేండ్లలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేన్నారు. నమ్మకం అంటే కేసీఆర్ అని, విశ్వాసం అంటే కేటీఆర్ అని, భరోసా అంటేనే బీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ సీట్లను గెలుస్తామని, నాయకులు బీఆర్ఎస్ను వీడినా..
పార్టీకి నష్టం లేదని, కార్యకర్తలు బలంగా ఉన్నారని తెలిపారు. ఈటల బీఆర్ఎస్ను మోసం చేసి బీజేపీలో చేరారన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 25 ఏండ్లుగా ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్నానని, అధిక మోజార్టీతో గెలిపించాలని శ్రేణులను కోరారు. నాగారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి, దమ్మాయిగూడ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు రమేశ్గౌడ్ ,వెంకటేశ్, శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.