Anand Mahindra | వన్డే ప్రపంచకప్ (World Cup match)లో టీమ్ఇండియా (Team India) అప్రతిహత విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న రోహిత్ సేన స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది. గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన పూర్తి ఏకపక్ష పోరులో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంక (Sri Lanka)ను చిత్తు చేసింది. లంక బ్యాటర్లను భారత బౌలర్లు కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో లక్ష్యఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా విజయంతో దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయంపై దిగ్గజ వ్యాపారవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. భారత బౌలర్లు శ్రీలంకను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘భారత బౌలర్లు శ్రీలంకను భయబ్రాంతులకు గురిచేశారు. వెస్టిండీస్ టీం ఉచ్ఛస్థితిలో ఉన్న రోజుల్లోనూ వారి బౌలర్లు ప్రత్యర్థి టీం వికెట్లు ఈ రీతిలో కూల్చారని నేను అనుకోను. మనోళ్లు నిజంగా శ్రీలంకకు భయానకవాతావరణం సృష్టించారు. మ్యాచ్ ముగియడంతో శ్రీలంక ఇక్కట్లు తీరినందుకు నేనైతే సంతోషించా’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది.
Not even in the glory days of the West Indies, when their pace attack was the most feared in the world, do I recall them ever unleashing this rain of wickets twice on the same team. A reign of terror… When the match ended, I just felt relief that the suffering had ended for SL. https://t.co/qYkPjlibfg
— anand mahindra (@anandmahindra) November 2, 2023
కాగా, ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించిన రోహిత్ సేన 14 పాయింట్లతో అందరికంటే ముందు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో ఏడు మ్యాచ్ల్లో ఐదు పరాజయాలతో శ్రీలంక సెమీస్ రేసుకు దూరమైంది. మొదట భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గిల్ (92 బంతుల్లో 92; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లీ (94 బంతుల్లో 88; 11 ఫోర్లు), శ్రేయస్ (56 బంతుల్లో 82; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (4) విఫలం కాగా.. ఆఖర్లో రవీంద్ర జడేజా (24 బంతుల్లో 35; ఒక ఫోర్, ఒక సిక్సర్) విలువైన పరుగులు జోడించాడు. లంక బౌలర్లలో మధుషనక 5 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. కసున్ రజిత (14), తీక్షణ (12 నాటౌట్), మాథ్యూస్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అందులో ఐదుగురు డకౌట్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5, సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టారు. లంక ప్లేయర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన షమీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తదుపరి మ్యాచ్లో ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Also Read..
Jaishankar | ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన దాడులు ఉగ్రవాద చర్యే : జైశంకర్
Karwa Chauth | కర్వాచౌత్ రోజు.. పుట్టింటికెళ్లిన భార్య తిరిగిరాలేదని బలవన్మరణానికి పాల్పడిన భర్త
Shreyas Iyer | అయ్యర్కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు.. సెలబ్రేషన్ వీడియో చూశారా..?