Shreyas Iyer : వరల్డ్ కప్లో భారీ స్కోర్ బాకీపడిన భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కీలక మ్యాచ్లో సత్తా చాటాడు. గురువారం వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై అర్థ శతకం(82 పరుగులు)తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. నాలుగో స్థానంలో తనను మించినవాళ్లు లేరని చాటుకున్న అయ్యర్ ఆ తర్వాత ఫీల్డింగ్లోనూ మెరిశాడు.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫీల్డర్ అవార్డుకు అయ్యర్ ఎంపికైనట్టు ప్రకటించగానే.. జట్టు సభ్యులంతా చప్పట్లుతో అయ్యర్ను అభినందించారు. అనంతరం కేఎల్ రాహుల్ ఆ మెడల్ను అయ్యర్ మెడలో వేసి.. అతడి మీసాల్ని మెలేశాడు. టీమిండియాలో రాహుల్ తర్వాత రెండుసార్లు బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్న రెండో క్రికెటర్ అయ్యర్ కావడం విశేషం.
6th Match: Shreyas ➡️ Rahul 👌🥇
7th Match: Rahul ➡️ Shreyas 👌🥇 #ShreyasIyer #INDvSLpic.twitter.com/CUPrtvgYEw— Shreyas Aryan (@Ariyen34) November 3, 2023
ముంబైలోని వాంఖడేలో భారత జట్టు రికార్డు విజయంతో వరల్డ్ కప్లో సెమీస్కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 357 పరగులు భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(88), శుభ్మన్ గిల్(92) అర్థ శతకాలతో అదరగొట్టగా.. మిడిల్ ఆర్డర్లో వచ్చిన అయ్యర్(82), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
భారీ ఛేదనలో ఆది నుంచి తడబడిన కుశాల్ మెండిస్ సేన షమీ, సిరాజ్ దెబ్బకు 55 పరుగులకే కుప్పకూలింది. దాంతో, భారత్ 302 రన్స్ తేడాతో గెలుపొంది సెమీస్లో అడుగుపెట్టింది. ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచుల్లో రోహిత్ సేన ఏడింట విజయం సాధించి ఫేవరేట్ ట్యాగ్ నిలబెట్టుకుంది.