Sunrisers Hyderabad | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సందడి మొదలైంది. టీంల వారీగా ఆటగాళ్ల ఎంపిక పూర్తికావటంతో పాటు, ఆయా టీంల యాజమాన్యాలు జట్టు కెప్టెన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తమ జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఏడెన్ మార్క్రమ్ (Aiden Markram)కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ (David Warner) గత సీజన్లో జట్టును వీడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేన్ విలియమ్స్ను (kane williamson)ను సర్రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో 2023 ఐపీఎల్ సీజన్కు జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ మయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ.. చివరికి మార్క్రమ్ వైపు ముగ్గు చూపింది.
ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్లో టైటిల్ నెగ్గిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు మార్క్రమ్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతని నాయకత్వంలోని జట్టు ఆ లీగ్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలను యాజమాన్యం అతడికే అప్పగించింది.
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
Also Read..
Australia ODI Squad: ఇండియాతో వన్డే సిరీస్.. ఆసీస్ జట్టులోకి మ్యాక్స్వెల్, మార్ష్
IND vs AUS | నేడు భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ పోరు.. ఆసీస్ను మన అమ్మాయిలు ఓడించేనా?
ICC | టెస్టు ఆల్రౌండర్ ర్యాంకింగ్స్.. టాప్ 5లో ముగ్గురు భారత క్రికెటర్లు
Womens T20 WC | మహిళల టీ20 వరల్డ్ కప్.. టీమిండియా సెమీస్ ఫైట్ ఈ జట్టుతోనే..!