న్యూఢిల్లీ: ఇండియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్(ODI Series) కోసం ఆస్ట్రేలియా జట్టు(Australia Team)ను ప్రకటించింది. 16 మంది సభ్యులు ఉన్న జట్టును వెల్లడించారు. పేస్ బౌలర్ రయి రిచర్డ్సన్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్(Maxwell), మిచెల్ మార్ష్(Marsh)లు తిరగి జట్టులో చేరనున్నారు. వన్డే జట్టుకు కెప్టెన్గా ప్యాట్ కమ్మిన్స్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వార్నర్, స్మిత్, లబుషేన్ కూడా జట్టుకు అందుబాటులో ఉండనున్నారు.
🚨 JUST IN: Australia have announced their 16-player squad for the ODI series against India.#INDvAUShttps://t.co/TuTQ7gbo2M
— ICC (@ICC) February 23, 2023
చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిల్.. ఆస్ట్రేలియా వన్డే జట్టు వివరాలను వెల్లడించారు. ఐసీసీ వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో తమ జట్టుకు మంచి ప్రాక్టీస్ అవుతుందని అన్నారు. ఈ ఏడాదిలోనే ఇండియాలో వరల్డ్కప్ జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్లో జరిగే ఆ టోర్నీ కోసం తమ జట్టు సంసిద్ధం అవుతోందన్నారు.
ఆసీస్ జట్టులో చాల మంది ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. అయినా కొందర్ని వన్డే సిరీస్కు సెలెక్ట్ చేశారు. సీమ్ బౌలర్ జోష్ హేజల్వుడ్ కూడా వన్డే జట్టులో ఉన్నారు. ప్రస్తుతం టెస్టు సిరీస్కు గాయంతో దూరంగా ఉన్న అతన్ని వన్డే సిరీస్కు ఎంపిక చేశారు.
మార్చి 17వ తేదీన ముంబైలో ఆసీస్, ఇండియా మధ్య తొలి వన్డే జరగనున్నది. వైజాగ్లో మార్చి 19వ తేదీన, చెన్నైలో మార్చి 22వ తేదీన మిగితా మ్యాచ్లు జరగనున్నాయి.