వాషింగ్టన్ : గత 30 ఏండ్లుగా అంతరిక్షంలో ఉండి చాలా ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి పంపుతున్న హబుల్ టెలిస్కోప్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. గత ఐదు రోజులుగా హబుల్ టెలిస్కోప్ నుంచి నాసాకు ఎలాంటి సిగ్నల్స్ అందడం లేదు. దాంతో నాసా శాస్త్రవేత్తలు కారణాలు కనుగొనే పనిలో పడ్డారు. అయితే, దీనికంతటికి మూలకారణం 1980 నాటి కంప్యూటర్లో లోపమని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ లోపాన్ని అధిగమించేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు. నాసా ప్రకారం, జూన్ 13 సాయంత్రం 4 గంటలకు దానిలోని పేలోడ్ కంప్యూటర్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. హబుల్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రస్తుతం ఈ టెలిస్కోప్ భూమి యొక్క చిత్రాలను తీయడం ఆపివేసింది.
కంప్యూటర్ లోపాన్ని తొలగించడంలో నిమగ్నమైన శాస్త్రవేత్తల బృందం.. దాని బ్యాకప్ మాడ్యూల్ను మూసివేసే ప్రయత్నంలో ఉన్నది. ఇది సాధ్యమైతేనే టెలిస్కోప్ పని చేయగలుగుతుంది. ఆదివారం ఈ వ్యవస్థ మూతపడటంతో దానిలోని ప్రధాన కంప్యూటర్ కూడా సిగ్నల్స్ ఇవ్వడం ఆపివేసింది. మేరీల్యాండ్లోని నాసా స్పేస్ ఫ్లైట్ సెంటర్లోని శాస్త్రవేత్తలు సోమవారం హబుల్ టెలిస్కోప్ కంప్యూటర్ను లాంచ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంత సమయం తర్వాత పాత సమస్యే ఎదురైంది.
హబుల్ టెలిస్కోప్ను 33 వేల కోట్లతో 1990 లో భూమి యొక్క తక్కువ కక్ష్యలో స్థాపించారు. ఈ టెలిస్కోప్ను నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు నాసా 10 బిలియన్ డాలర్ల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ప్రారంభించటానికి యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
కరోనా పుట్టినిల్లు.. వుహాన్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
చరిత్రలో ఈరోజు.. ముంతాజ్ జ్ఞప్తిగా తాజ్మహల్ నిర్మాణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..