సంగారెడ్డి కలెక్టరేట్: అపుడే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లి పాలు పట్టాల్సిన విషయంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ పేర్కొన్నారు. అందుకోసం వారం రోజుల్లో లాక్టేషన్ కౌన్సిలర్లను గుర్తించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావే శ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధికారులతో ఆమె సమీక్షించారు. మాతా శిశు సంరక్షణ, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లో పరీలపై ఆరా తీశారు. ఆయా సెంటర్లలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లి పాలు పట్టేలా లాక్టేషన్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయా లని, లేబర్ రూమ్లో కూర్చుని అవగాహన కల్పించేలా వారిని సిద్దం చేయాలన్నారు. ఈ నెల 18 నుంచి ఇవ్వనున్న న్యూ మోకానికల్ కాంజుగేట్ వ్యాక్సిన్ను 100 శాతం పిల్లలకు వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పుట్టుక లోపాలున్న పుల్లలను గుర్తించి వైద్య చికిత్స చేయాలన్నారు. ఎన్సీడీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది చిత్త శుద్దితో పని చేయాలని ఆమె సూచించారు. డాక్టర్లు సిబ్బంది కొరత, సమస్యలపై ఆరా తీసి, ఆయా సమస్యలను పరిష్కరించేలా చూస్తామని చెప్పారు.
టెలీ కాన్సల్టేషన్స్ అన్ని కేంద్రాల్లో చేపట్టాలి
జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో టెలీ కన్సల్టేషన్ చేయాలని కరుణ స్పష్టం చేశారు. ప్రజలకు బాగా ఉపయోగపడుతుంద ని, దీన్ని వినియోగించుకునేలా ఆయా కేంద్రా ల వైద్యులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో గల పీహెచ్సీ భవనాలకు సంబంధించి పాతవి మరమతులు కావాల్సినవి, అసలే భవనాలు లేని వాటిని గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేలో టీబీ వ్యాధి గ్రస్తులను గుర్తించి స్పుటం శాంపిల్ కలెక్ట్ చేయాలని, వారి వద్దకు వెళ్లి అన్ని విషయాలపై అవగాహన కల్పించి తగిన వైద్య సేవలు అందించాలన్నారు.
జిల్లాలో నార్మల్ డెలీవరీలు పెరిగాయని, సి సెక్షన్స్ తగ్గాయని వెల్లడించారు. నార్మల్ డెలీవరీలలో జిల్లా రాష్ట్రంలోనే ముందు ఉన్నదని ఆమె అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్శీ షా, హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జేడీ డాక్టర్ పద్మజ, డీఎం ఆండ్ హెచ్వో డాక్టర్ గాయత్రీ దేవి, ఇతర వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.