అమరావతి : గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Varaprasad) శుక్రవారం రాత్రి టీడీపీలో చేరారు. చంద్రబాబు(Chandra Babu) సమక్షంలో అనుచరులతో కలిసి టీడీపీ (TDP) లో చేరారు. టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచిన వరప్రసాద్ 2020లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనంతరం ఆయనకు వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తాడికొండ టికెట్ను మాజీ మంత్రి మేకతోటి సుచరితకు అవకాశం దక్కడంతో మనస్తాపానికి గురైన డొక్కా కొన్ని రోజులుగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షపదవితో పాటు క్రియాశీల సభ్యత్వానికి రాజీనామాచేస్తూ వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్కు లేఖను పంపారు.