చేర్యాల, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ అధినేత చేపట్టిన బస్సు యాత్రతో అధికార పక్షానికి వణుకు మొదలైందని బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేక సంతోశ్, మంద యాదగిరి, అనంతుల మల్లేశం, ముస్త్యా ల నాగేశ్వర్రావు, కొమురవెల్లి జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి శ్రీధర్రెడ్డి, ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు.
గురువారం భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత బస్సుయాత్ర, రోడ్ షోకు చేర్యాల,కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల నుంచి వందలాది వాహానాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు,కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.