వికారాబాద్: జిల్లాలో మొదటి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. తాండూరు మండలం ఎలంకన్న గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి బ్లాక్ఫంగస్తో మృతిచెందారు. ఆయన కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. దీంతో మహబూబ్నగర్ జిల్లాలోని ఓ దవాఖానలో చేరారు. అటునుంచి హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు చనిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి