న్యూఢిల్లీ: మాజీ రైల్వేశాఖ మంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్కు .. డీఎల్ఎఫ్ అవినీతి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాణా కుంభకోణంలో దోషిగా తేలి గత మూడేళ్ల నుంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ ఏప్రిల్లో బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. డీఎల్ఎఫ్ గ్రూప్కు చెందిన అవినీతి కేసును సీబీఐ 2018 నుంచి విచారించింది. ముంబైలోని బాంద్రాలో రైల్వే ప్రాజెక్టు, న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ ప్రాజెక్టు కోసం డీఎల్ఎఫ్ గ్రూపు మాజీ రైల్వేశాఖ మంత్రి లాలూ యాదవ్కు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏబీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే ఓ బోగస్ కంపెనీ అతి తక్కువ ధరకు ఢిల్లీలో ఓ ప్రాపర్టీని సొంతం చేసుకున్నదని, డీఎల్ఎఫ్ ఫండింగ్తో ఎక్కవ ధర పలికే భూమిని తక్కువ ధరకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. తేజస్వియాదవ్ తో పాటు లాలూ కుటుంబ సభ్యలు ఆ ప్రాపర్టీని సొంతం చేసుకున్నారు. డీఎల్ఎఫ్, లాలూ మధ్య కుదిరిన లావాదేవీలను కూడా సీబీఐ విచారించింది. అయితే రెండేళ్ల విచారణ తర్వాత ఆ ఒప్పందంలో ఎటువంటి అక్రమం జరగలేదని సీబీఐ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.