హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పాస్లు, ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలకు చెందిన వారి వాహనాలనే అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు.
నగరంలో ఏర్పాటు చేసిన ఆయా చెక్ పాయింట్ల వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటం.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ఇంకాస్త కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.