Footpath Shops | జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో చిరు వ్యాపారుల షాపులపై ఝుళుం ప్రదర్శిస్తున్నారు. మల్కాజ్గిరిలో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు ఫుట్పాత్పై ఉన్న చిరు వ్యాపారుల షాపులు తొలగిస్తున్నారు. షాపుల యజమానులు సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కనికరించని టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలతో వారి షాపులను నేట మట్టం చేస్తున్నారు.
ఫుట్పాత్పై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న తమ పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై చిరు వ్యాపారుల ఆందోళన చెందుతున్నారు. చిరు వ్యాపారుల పట్ల పోలీసుల పహారాలో జీహెచ్ఎంసీ అధికారుల దాడులు ఎలా ఉన్నాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
మల్కాజ్గిరిలో ఉద్రిక్తత
ఫుట్పాత్పై ఉన్న షాపులు తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు
సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని చిరు వ్యాపారుల ఆందోళన pic.twitter.com/SYmPV2Gkc9
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్డే మ్యాషప్ వీడియో