Gurukul Student | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రావణి(14) అనుమానాస్పదంగా మృతి చెందింది. శ్రావణి గుండెపోటుతో మృతి చెందిందని సిబ్బంది చెప్తున్నా, తమ కూతురు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
గురుకుల విద్యార్థిని శ్రావణి కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ పరామర్శించారు. విద్యార్థిని మృతిపై జాజుల సురేందర్ నిరసన చేపట్టగా.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన కూతురు ఎలా చనిపోయిందో కూడా చెప్పటం లేదంటూ శ్రావణి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
3 నెలల క్రితం ఇదే గురుకుల హాస్టల్లో ఆకస్మాత్తుగా తనిఖీలు చేయగా.. పురుగుల అన్నం, తాగునీటి సమస్య, చెడిపోయిన కూరలు, పని చేయని సీసీ కెమెరాలను గుర్తించిన జాజుల సురేందర్ ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు సమస్యలు పరిష్కరించలేదని, నిన్న విద్యార్థిని చనిపోతే గుండెపోటుతో అని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని జాజుల సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థిని చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన మాజీ ఎమ్మెలయే జాజుల సురేందర్ను పోలీసులు అరెస్ట్ చేసి నాగిరెడ్డి పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుండెపోటుతో మరణించిందని చెప్తున్న సిబ్బంది, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో, నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రావణి(14)… pic.twitter.com/cMW2Z3Yxss
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026
గురుకుల విద్యార్థిని మృతిపై నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ను అరెస్ట్ చేసిన పోలీసులు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని శ్రావణి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్
తన కూతురు ఎలా… https://t.co/wuLNwxImHU pic.twitter.com/Ez0GkYtL6f
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం – బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని మృతి 😢
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రావణి (14) మృతి.
నాడు బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా ఉన్న గురుకులాలు, నేడు తుగ్లక్ రేవంత్ నిర్లక్ష్యం వల్ల… pic.twitter.com/dnhHyVfKgw
— BRS Party (@BRSparty) April 15, 2026
Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు