భువనగిరి, ఏప్రిల్ 15 : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమాపురంలో దారుణ సంఘటన జరిగింది. రెండేళ్ల వయస్సు ఉన్న కూతురిని కన్న తండ్రే గొంతు నులిమి హతమార్చాడు. గ్రామానికి చెందిన శ్రీరాములు, తన భార్యకు మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గడిచిన ఉగాది పండుగకు భార్య తన తల్లిగారింటికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ గొడవలు ఎక్కువయ్యాయి. ఈ వివాదాల నేపథ్యంలో శ్రీరాములు తన కూతురిని హతమార్చినట్లు సమాచారం. శ్రీరాములుకు చెవులు వినబడవు, మాటలు రావు. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.