సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెమ్యునరేషన్ల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో హీరోల రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్లో అగ్రభాగం ఆక్రమించేస్తుంది. టాప్ రేంజ్ హీరోల పారితోషికం రూ.50 కోట్ల వరకు చేరింది. మీడియం రేంజ్ హీరోలు రూ. 10 కోట్ల నుంచి రూ15 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
ఈ జాబితాలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చేరిపోయాడు. ఎఫ్ 3 సినిమా కోసం వరుణ్ తేజ్ రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుండగా..లేటెస్ట్ గా ఒకే చేస్తోన్న సినిమాలకు రూ.12 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. బోగవల్లి ప్రసాద్ తెరకెక్కించనున్న సినిమా కోసం వరుణ్ తేజ్ ఇంత మొత్తంలో తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తంలో రూ.8 కోట్లు రెమ్యునరేషన్ కాగా..మిగిలిన మొత్తం షేర్ రూపంలో నాగబాబు తీసుకోబోతున్నట్టు న్యూస్ చక్కర్లు కొడుతోంది.
శర్వానంద్, నితిన్, నాగచైతన్య కూడా అంత పారితోషికం డిమాండ్ చేయడం లేదు. నాని ప్రస్తుతం రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇవన్నీ చూస్తే మీడియం హీరోల్లో అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు వరుణ్ తేజ్.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!