కరోనా రెండో వేవ్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమవంతుగా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖులు, రాజకీయ నాయకులు సీఎంఆర్ఎఫ్కు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తి ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి కోటి రూపాయలు విరాళంగా అందించారు. మురుగదాస్ 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త్ విశాగణ్ కోటి రూపాయలు అందించారు.దర్శకుడు వెట్రిమారన్ తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసి రూ.10 లక్షల చెక్ అందించారు.
ఇక ఎడిటర్ మోహన్, ఆయన తనయుడు మోహన్ రాజా, జయం రవి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 10 లక్షల రూపాయల విరాళం అందించారు. తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షల చెక్ను సీఎంకు అందించారు. మురుగదాస్,శంకర్తో పాటు పలువురు ప్రముఖులు కూడా విరాళాలు అందజేశారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సెక్రటేరియట్లో సీఎం స్టాలిన్ను కలిసి పాతిక లక్షల రూపాయల చెక్ అందించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంలోనే కాదు తెలుగు సినిమాలతోను బిజీగా ఉన్న విషయం తెలిసిందే.