హైదరాబాద్: రుక్మాపూర్లోని తెంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సంక్షేమ సైనిక విద్యాలయం, అశోక్నగర్లోని గిరిజన గురుకుల సైనిక పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, కౌన్సిలర్ పోస్టుల భర్తీకి తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులను రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేయనుంది. ఎంపికైన వారిని పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ విధానంలో నియమించనుంది. ఇందు టీజీటీ, పీజీటీ, జేఎల్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, కౌన్సిలర్ పోస్టులు ఉన్నాయి.
అర్హత: బీఈడీ పూర్తిచేసి టెట్లో అర్హత సాధించాలి. సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ. రాతపరీక్షకు 100 మార్కులు, డెమోకు 25, ఇంటర్వ్యూ 25 మార్కుల చొప్పున ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500 (డీడీ తీయాలి)
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
వెబ్సైట్: https://tswreis.in/ and https//tgtwgurukulam.telangana.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి