ముంబై : ముఖేష్ అంబానీ నివాసం వద్ద బాంబులతో పట్టుబడిన వ్యాన్ కేసులో ఇప్పటికే అరెస్టయిన సస్పెండ్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ను వచ్చే నెల 3 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి పంపారు. ఈ కేసులో తనను బలిపశువుగా మార్చారని సచిన్ వాజ్ ఆరోపించారు.
వాజ్ నివాసం నుంచి లెక్కలో లేని 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ కోర్టుకు సెంట్రల్ దర్యాప్తు సంస్థ తెలిపింది. పోలీసు అధికారిగా తనకు కేటాయించిన 30 బుల్లెట్లలో 25 గుర్తించగా.. మరో ఐదు గుర్తించలేనివిగా ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొన్నది.
ఇలాఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. ‘నన్ను బలిపశువుగా మార్చారు. నేను కేవలం ఒకటిన్నర రోజులు పరిశోధనా అధికారి (ఐఓఓ) గా ఉన్నాను. నేను చేయగలిగినదంతా చేశాను. నేను మాత్రమే కాదు క్రైమ్ బ్రాంచ్ అధికారులు అందరూ తమ వంతు కృషి చేశారు. అకస్మాత్తుగా మార్పులు జరిగాయి. మార్చి 13 న నేను స్వయంగా ఎన్ఐఏకు వెళ్లాను. అక్కడే నన్ను అరెస్టు చేశారు’ అని వాజ్ ఎన్ఐఏ కోర్టుకు తెలిపారు. తనను మళ్లీ పోలీసు కస్టడీకి పంపవద్దని కోర్టును కోరిన ఆయన.. అందుకు సంబంధించి కొన్ని లిఖితపూర్వక సమర్పణలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అంబానీ నివాసం వద్ద బాంబులతో భయపెట్టే కేసులో సచిన్ వాజ్ పాత్ర పోషించారని గుర్తించినందుకు ఉగ్రవాద చర్యకు శిక్ష, నేరపూరిత కుట్రకు సంబంధించి యూఏపీఏ కింద ఆరోపణలను ఎన్ఐఏ బుధవారం జత చేసింది.
క్రిమినల్ కుట్ర కోసం వాజ్పై తొలుత సెక్షన్ 120 (బీ) కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పేలుడు పదార్ధాలకు సంబంధించి నిర్లక్ష్య ప్రవర్తనకు 286, ఫోర్జరీకి 465, నకిలీ ముద్రను తయారు చేయడానికి లేదా కలిగి ఉండటానికి 473, క్రిమినల్ బెదిరింపులకు 506 (2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
బెంగాల్లో మిథున్ చక్రవర్తి మెగా రోడ్షోలు
గెలిపిస్తే అయోధ్య యాత్ర తీసుకెళ్తానని హామీ.. ఈసీ నోటీసులు
ఒర్లీన్స్ మాస్టర్స్ క్వార్టర్స్లోకి ప్రవేశించిన సైనా
వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపేయవద్దంటున్న స్మోకింగ్ ప్రియులు
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
పుతిన్కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు
రైల్వే ప్లాట్ఫాంపై ఏనుగు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..