హరిద్వార్ : అడవిలో ఉండాల్సిన ఏనుగు ఒకటి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం పైకి రావడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. రైలు కోసం ఎదురుచూస్తున్న వారు బతుకుజీవుడా.. అంటూ తలో దిక్కు పారిపోయారు. ఈ ఘటన హరిద్వార్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఉత్తరాఖండ్లోని రాజాజీ టైగర్ రిజర్వ్ నుంచి ఈ ఏనుగు హరిద్వార్ వైపు వచ్చినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
హరిద్వార్ రైల్వే స్టేషన్లో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రైళ్త కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక ఏనుగు తొండాన్ని ఆడించుకుంటూ ప్లాట్ఫాంపైకి వచ్చింది. అడవిలో ఉండాల్సిన ఏనుగు కాస్తా ప్లాట్ఫాంపై కనిపించడంతో కంగుతిన్న ప్రయాణికులు భయంతో తలోదిక్కు పారిపోయారు. రెండో నంబర్ ప్లాట్ఫాంపైకి వచ్చిన ఏనుగును గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది.. బిల్వకేశ్వర్లోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దాంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సాయంతో ఏనుగును సమీపంలోని రాజాజీ టైగర్ రిజర్వ్లోకి పంపించారు. దాంతో రైల్వే సిబ్బంది సహా ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హరిద్వార్-డెహ్రాడూన్ రైల్వే రహదారి రాజాజీ టైగర్ రిజర్వ్ గుండా వెళ్తుంది. ఇక్కడ రైల్వే లైన్లపైకి ఏనుగులు రావడం తరుచుగా జరుగుతుంది. ఇటీవల రైలు ఢీకొని ఒక ఏనుగు కూడా చనిపోయింది. దాదాపు గంటకు పైగా ప్లాట్ఫాంలపై తిరుగుతూ అలజడి సృష్టించింది.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..