గాలే: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు(SL Vs Ind)లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. జట్టులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు. టెస్టు చరిత్రలో భారత్కు ఇది 600వ మ్యాచ్ కావడం విశేషం. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి వికెట్ అనుకూలంగా ఉందని అన్నారు. శ్రీలంక జట్టులో ఆఫ్ స్పిన్ బౌలర్ కేశర నువాంత అరంగేట్రం చేస్తున్నాడు. అతను కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. భారత తుది జట్టులోకి సారాన్ష్ జైన్ లేదా అకిబ్ నబీకి చోటు దక్కలేదు. జడేజా, కుల్దీప్, సుతార్ .. భారత్ తరపున స్పిన్ పాత్ర పోషించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాలే స్టేడియంలో భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU
— BCCI (@BCCI) August 15, 2026