కోల్కతా : తనను గెలిపిస్తే ఓటర్లను తన సొంత ఖర్చులతో అయోధ్యకు తీసుకెళ్తానని బీజేపీ అభ్యర్థి ఒకరు ఎన్నికల హామీ ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆగ్రహం వ్యక్యం చేసింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ సదరు అభ్యర్థికి షోకాజ్ నోటీసులు పంపింది.
బీజేపీ పండబేశ్వర్ నియోజకవర్గం అభ్యర్థిగా జితేంద్ర తివారీ బరిలో ఉన్నారు. ఇటీవల రెండు ప్రచార కార్యక్రమాల్లో తనను గెలిపిస్తే ఓటర్లను ఉచితంగా అయోధ్యకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మార్చి 21 న హరిపూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఈ మేరకు జితేంద్ర తివారీ హామీలు గుప్పించారు. ఈ విషయాన్ని మరుసటిరోజు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దాంతో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ జితేంద్ర తివారీకి ఈసీ నోటిసిచ్చింది.
కాగా, తనకు ఈసీ షోకాజ్ నోటీసు ఇచ్చిన మాట వాస్తవమే అని జితేంద్ర తివారీ స్పష్టం చేశారు. అలా హామీ ఇవ్వడం ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుందని తనకు తెలియదని అన్నారు. తన అజ్ఞానానికి మన్నించాలంటూ జితేంద్ర తివారీ ఈసీకి క్షమాపణలు చెప్పారు.
ఒర్లీన్స్ మాస్టర్స్ క్వార్టర్స్లోకి ప్రవేశించిన సైనా
వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపేయవద్దంటున్న స్మోకింగ్ ప్రియులు
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
పుతిన్కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు
రైల్వే ప్లాట్ఫాంపై ఏనుగు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..