ముంబై: ఐపీఎల్ ఆరంభానికి ముందు మరో షాక్ తగిలింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది. ఇద్దరు మైదాన సిబ్బంది, ఒక ప్లంబర్కు కొవిడ్ పాజిటివ్గా తేలింది. ముంబైలో షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజే మరో ముగ్గురు కరోనా బారిన పడటం గమనార్హం. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ వార్తను ధృవీకరించింది.
టోర్నీని సజావుగా నడిపే ఉద్దేశంతో మైదాన సిబ్బంది స్టేడియంలోనే ఉంటున్నారని, ప్రయాణాలు చేయడం లేదని ఎంసీఏ స్పష్టం చేసింది. గతంలో ఇదే స్టేడియంలో పని చేసే పది మంది సిబ్బందికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. మరింత మందికి కరోనా సోకకూడదన్న ఉద్దేశంతో ముంబై ఐపీఎల్ మ్యాచ్లు ముగిసే వరకూ మైదాన సిబ్బంది మొత్తం స్టేడియంలోని క్లబ్ హౌజ్లోనే ఉంటున్నట్లు ఎంసీఏ అధికారి ఒకరు చెప్పారు.
ఇవి కూడా చదవండి
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
ఈవీఎంతో బంధువుల ఇంటికి.. సెక్టార్ ఆఫీసర్ సస్పెండ్
ఓటేసిన రజనీకాంత్, కమల్ హాసన్