కిన్షాసా : డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడటంతో దాదాపు 39 మంది మరణించినట్లు సమాచారం. కాంగో తూర్పు చివరన ఉన్న బోగా, తచాబీ గ్రామాలలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థగా కాంగో ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలపై ఈ దాడి జరిగిందని ఒక వార్తా సంస్థ ధ్రువీకరించింది. ఈ దాడిలో మరణించిన మొత్తం 39 మందిలో ఇప్పటివరకు 36 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. ఉత్తర కివు ప్రావిన్స్-ఇటురి మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్నదని, రెండు ప్రాంతాలలో ఎప్పుడూ ఉద్రిక్తతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
కాంగో తూర్పు చివరను ఆక్రమించిన 122 మంది ఉగ్రవాదుల ఏడీఎఫ్ చాలా ఘోరమైన సమూహంగా అంచనా వేయబడింది. వాస్తవానికి, ఈ ప్రాంతం ఖనిజాలతో నిండి ఉన్నది. ఈ కారణంగా ఈ స్థలం గురించి అనేక వివాదాలు ఉన్నాయి. 1996-2003 మధ్య రెండు ప్రాంతీయ యుద్ధాలు కూడా జరిగాయి. ఉత్తర కివులోని బెని ప్రాంతంలో 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 1228 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఎన్జీఓ కేఎస్టీ అంచనా వేసింది.
ట్విట్టర్కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కొత్త ఐటీ నిబంధనలు పాటించాలని ఆదేశం
కేంద్రానికి మమత ఘాటు జవాబు.. ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ సీఎస్
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు.. మీరూ తెలుసుకోండి..!
కరోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థికవేత్తల అంచనా
ముంబైలో కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగన్
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..