కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎస్ అలపన్ బంధోపాధ్యాయను కేంద్ర సర్వీసులకు పంపాలని ఆదేశించిన కేంద్రానికి మమతా బెనర్జీ ఘాటుగానే సమాధానమిచ్చారు. సోమవారం పదవీ విరమణ చేసిన ఆయనను రాష్ట్ర ప్రధాన సలహాదారుగా నియమించి ఎత్తుకు పైఎత్తు వేసింది. కేంద్ర సర్వీసులకు తిరిగి రావడానికి నిరాకరించినందుకు కేంద్రం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
కేంద్రం – బెంగాల్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ఘర్షణ సోమవారం కొత్త మలుపు తీసుకున్నది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బంధోపాధ్యాయను సోమవారం ఉదయం కేంద్రం ఢిల్లీకి పిలిచినప్పటికీ ఆయన వెళ్లలేదు. దాంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు పంపింది. కేంద్రం ఈ చర్య తీసుకున్న కొద్ది నిమిషాల తర్వాత అలపన్ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేయించి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా హెచ్కే ద్వివేది నియమితులయ్యారు. హోం శాఖ కార్యదర్శిగా బీపీ గోపాలికను నియమించారు.
యాస్ తుఫానుపై మోదీ జరిపిన సమీక్షా సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అలపన్ బంధోపాధ్యాయను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన సోమవారం ఉదయం 10 గంటలలోపే ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉన్నది. అయితే, అలపన్ బంధోపాధ్యాయ మే 31 నే పదవీ విరమణ చేస్తున్నారని మమతా బెనర్జీ మీడియాకు చెప్పారు. చెప్పిన కొద్ది సేపటికే ఆయనను ప్రధాన సలహాదారుగా నియమించి కేంద్రానికి ఘాటుగా జవాబిచ్చింది.
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు.. మీరూ తెలుసుకోండి..!
కరోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థికవేత్తల అంచనా
ముంబైలో కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగన్
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
వానాకాలం కరోనా వైరస్తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..