న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్కు షాకిచ్చింది. కొత్త ఐటీ నిబంధనలను నిషేధించకపోతే వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ హుకూం జారీ చేసింది. జస్టిస్ రేఖ పల్లి ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్కు నోటీసు ఇచ్చి స్పందన కోరింది.
విచారణ సందర్భంగా, కొత్త నిబంధనల ప్రకారం స్థానిక ఫిర్యాదు అధికారిని నియమించినట్లు ట్విట్టర్ పేర్కొన్నది. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన స్టాండింగ్ కౌన్సెల్ రిపుదమన్ సింగ్ భరద్వాజ్ వాదనలు కొనసాగిస్తూ.. ట్విట్టర్ కేంద్రం తెచ్చిన నిబంధనలను పాటించడం లేదని చెప్పారు. ఈ పిటిషన్ను న్యాయవాదులు అమిత్ ఆచార్య, ఆకాష్ వాజ్పేయి, మనీష్ కుమార్లు దాఖలు చేశారు. ఈ నెల 25 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ట్విట్టర్ స్థానిక గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించాల్సి ఉండగా, ఇది జరుగలేదని పేర్కొన్నారు. కొన్ని ట్వీట్లకు వ్యతిరేకంగా ట్విట్టర్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిబంధనలను పాటించలేదని తెలిసిందని కోర్టుకు తెలిపారు. ఐటీ నిబంధనలు పాటించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని వారు వాదించారు.
ఇలాఉండగా, ముఖ్యమైన మార్కెట్గా భారతదేశానికి కట్టుబడి ఉంటామని ట్విట్టర్ ఇటీవల పేర్కొన్నది. అయితే, కొత్త ఐటీ నియమ నిబంధనలను విమర్శించింది. ఇది బహిరంగ సంభాషణను నిరోధించగలదని పేర్కొన్నది. భారతదేశాన్ని కించపరిచేలా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని కేంద్రం తెలిపింది. కొత్త డిజిటల్ నిబంధనలను పాటించడానికి ట్విట్టర్ నిరాకరించింది.
కేంద్రానికి మమత ఘాటు జవాబు.. ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ సీఎస్
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
రేపటి నుంచి పలు విషయాల్లో మార్పులు.. మీరూ తెలుసుకోండి..!
కరోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థికవేత్తల అంచనా
ముంబైలో కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగన్
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..