సాధారణంగా హోటళ్లు బిల్లును బట్టి డిస్కౌంట్ ఇస్తాయి. కానీ, హైదరాబాద్ ఖాజాగూడలోని దక్షిణ్-5 రెస్టారెంట్ మాత్రం మర్యాదను బట్టి డిస్కౌంట్ ఇస్తుంది. ఉదాహరణకు.. అక్కడ మెనూ కార్డు ప్రకారం వెజ్ థాలీ ధర.. నూట అరవై అయిదు రూపాయలు. మన టేబుల్ దగ్గరికి వచ్చిన వెయిటర్కు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఏక వచనంతో సంబోధిస్తూ ‘ఏక్ వెజ్ థాలీ’ అని దర్పంగా ఆర్డర్ ఇస్తే.. ‘నో డిస్కౌంట్’! అలా కాకుండా, ‘ఒక వెజ్ థాలీ ప్లీజ్’ అని అనునయంగా చెబితే బిల్లు పాతిక రూపాయలు తగ్గుతుంది.
ఇంకొంత ఆత్మీయంగా ‘గుడ్ ఆఫ్టర్నూన్.. ఒక వెజ్ థాలీ ప్లీజ్’ అన్నామనుకోండి మరో రూ.15/- డిస్కౌంట్ పొందవచ్చు. అంటే, నూట ముప్పై అయిదు రూపాయలు బిల్లు చెల్లిస్తే చాలు! ‘సాధారణంగా హోటళ్లలో పనిచేసేవాళ్లంటే ఇంటా, బయటా చిన్నచూపు ఉంటుంది. చాలామంది కస్టమర్లు అమర్యాదగా ప్రవర్తిస్తారు. అందుకే ఈ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చాం’ అంటూ తమ డిస్కౌంట్ ఆఫర్ల వెనకున్న ఉద్దేశాన్ని చెబుతారు రెస్టారెంట్ వ్యవస్థాపకులు సోలంకి, సంజయ్ కపూర్. తెలంగాణ సహా ఐదు దక్షిణాది రాష్ర్టాల్లో వీరు ఆతిథ్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక రాయితీ ఇస్తారు. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే .. డబ్బుతోపాటు కాస్త మర్యాద కూడా తెలిసి ఉండాలన్నమాట.
హల్వా అంటే చాలు.. చక్కెర తియ్యదనం, నెయ్యి కమ్మదనం గుర్తొచ్చి నోట్లో నీళ్లూరుతాయి. మరి హల్వా చేదుగా ఉంటే? ఊహించడానికే కష్టంగా ఉందా? వినడానికి వింతగా ఉన్నా కాకరకాయ హల్వా నేటి మేటి వెరైటీ వంటల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ వెరైటీ హల్వా ఆరోగ్యానికీ మంచిదని నిపుణుల మాట. ఎలా వండుకోవాలి మరి? అంటారా. మిగతా హల్వాలు తయారు చేసినట్టే!
మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఉదయాన్నే విధిగా టిఫిన్ వండుకోవడం అంత సులభం కాదు. దీంతో బయటే తినాల్సి వస్తున్నది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఖర్చు సంగతి సరేసరి. ఉద్యోగినుల పరిస్థితే కాదు, గృహిణుల అవస్థలూ అలాగే ఉన్నాయి. సమయానికి అందరికీ అన్నీ అందించడం కత్తిమీద సాములా తయారైంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ఆరోగ్యకరమైన అల్పాహారం అందించడమే లక్ష్యంగా ‘బ్రేక్ఫాస్ట్ ఇన్ బాటిల్స్(BiBs)’ స్టార్టప్ను ప్రారంభించారు దిలీప్ అల్లంశెట్టి. కరోనా మహమ్మారి రాజ్యమేలుతున్న సమయంలో.. పౌష్టికాహారమే రోగ నిరోధక శక్తిని పెంచే పరమౌషధం అని నిపుణులు ధ్రువీకరించడంతో.. జిమ్ ట్రైనర్లు, పోషకాహార నిపుణులు, డైటీషియన్ల మార్గదర్శకత్వంలో తాజా పండ్లు, కూరగాయలతో తయారయ్యే సరికొత్త అల్పాహారాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు దిలీప్. ఈ బ్రేక్ ఫాస్ట్ను ఎప్పుడైనా ఎక్కడైనా సేవించవచ్చు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా తయారుచేసే ఈ అల్పాహారం శరీరంలో పోషకాలను సమతౌల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. 350ml బాటిల్ తాగితే శరీరానికందే శక్తి దాదాపు 300 క్యాలరీలు మాత్రమే. అందువల్ల అధికబరువు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కటి ఆహారంగా పనిచేస్తుందంటున్నారు దిలీప్. రెండురోజులకు రూ.280/- సబ్స్క్రిప్షన్తో సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కేపీహెచ్బీ కాలనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ 12 కి.మీ మేర డెలివరీ అందిస్తున్నది.
ఏం కావాలి?
యాపిల్ పండ్లు: నాలుగు(పెద్దవి), చక్కెర: ఒక స్పూన్, చాక్లెట్ పౌడర్: అర టీస్పూన్, వాల్నట్స్: పావు కప్పు, వెన్న: నాలుగు ముక్కలు (అంగుళం చొప్పున), దాల్చిన చెక్క పొడి: అర టీస్పూన్.
ఎలా చేయాలి?
ముందుగా యాపిల్స్ను బాగా కడిగి పైన కొద్దిభాగం కత్తిరించాలి. చిన్న స్పూన్ సాయంతో మధ్యలో గింజలుండే భాగాన్ని జాగ్రత్తగా తీసేసి కొంచెం పెద్దగా రంధ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో తరిగిన వాల్నట్స్, చాక్లెట్ పొడి, చక్కెర, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. యాపిల్ రంధ్రంలో వాల్నట్స్ మిశ్రమాన్ని నింపి పైనుంచి బటర్ ముక్క పెట్టాలి. కొంచెం లోతుగా ఉండే ఒక ప్లేట్లో గ్లాసునిండా నీళ్లుపోసి యాపిల్స్ ఉంచాలి. ఓవెన్ను 350 డిగ్రీల వద్ద అయిదు నిమిషాలు ప్రీ హీట్ చేసి యాపిల్స్ ప్లేట్ పెట్టి 45 నిమిషాలపాటు బేక్ చేయాలి. పైనుంచి చాక్లెట్ సిరప్గానీ, చక్కెర పొడిగాని చల్లుకుంటే నోరూరించే బేక్డ్ యాపిల్స్ రెడీ.
ఎండాకాలం లో ఒంటిని చల్లబరిచి, సత్వర శక్తిని అందించే పదార్థాల్లో దోసకాయ ఒకటి. దీన్నే కీరా అని కూడా పిలుస్తారు. అధికశాతం నీటిని కలిగి ఉండే దోసకాయలో పోషకాలు కూడా అపారమే.
తెలుగు సంవత్సరాల పేర్లు కిడ్నీలను శుభ్రపరచడంలో, వ్యర్థాలను బయటకు పంపించడంలో ప్రకృతి సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. వీటిలోని మినరల్స్ కిడ్నీలోని రాళ్లను కరిగిస్తాయి.
♦ కీరాలో క్యాన్సర్తో పోరాడే కారకాలు ఎక్కువ. దీనిలోని ఔషధ గుణాలు బ్రెస్ట్, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లను నివారించడంలో సాయపడతాయి. దీనిలో ఉండే పాలీఫినాల్స్, ఫైటో
న్యూట్రియెంట్స్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి.
♦ దీనిలోని ఆల్కనిటి అల్సర్లను నివారించడంలో సాయపడుతుంది. రోజూ రెండు గ్లాసుల కీరా జ్యూస్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
♦ కీరాలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలు రక్తపోటును నియంత్రిస్తాయి. హైబీపీతోపాటు లోబీపీని నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. శరీరానికి కావలసినంత నీటిని సమకూర్చి డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
♦ చర్మ సౌందర్యం పెంపొందించడంలోనూ కీరా బాగా పనిచేస్తుంది. రోజూ నిద్రపోయేముందు కీరాను చక్రాల్లా కోసి కళ్లమీద పెట్టుకుంటే అలసటతోపాటు కంటికింది నల్లటి వలయాలు, వాపులు కూడా తగ్గుతాయి.
♦ పులుసు కూర అయితే ఒక చిన్న ఆలుగడ్డను తొక్కతీసి రెండు ముక్కలు చేసి కూరలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆలుగడ్డకు ఉప్పును గ్రహించే గుణం ఉంటుంది.
♦ గోధుమపిండిని ముద్దలా చేసుకుని రెండు మూడు ఉండలను కూరలో వేసి రెండు నిమిషాలు బాగా కలిపి తీసేసినా ఫలితం ఉంటుంది.
♦ గ్రేవీ కూరలైతే ఒక టమాట మెత్తగా ఉడికించి మెదిపి కూరలో కలిపితే సరి. నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
♦ ఫ్రై అయితే ఒక టీస్పూన్ పాలు లేదా పెరుగు వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి.
“అమ్మో ! ఒక్క సమోసా 900 రూపాయలా? ఎక్కడో తెలుసా!!”
Fruits | మనం పండ్లు ఎందుకు తినాలి?
“Matka Pizza | కుండ పిజ్జా ఎప్పుడైనా రుచి చూశారా?
buffet | బఫేలో ఏం తినాలి? ఎలాంటి టిప్స్ పాటిస్తే మంచిది?
RRR | ట్రిపుల్ ఆర్ కుకింగ్ గురించి తెలుసా? దీనివల్ల లాభమేంటి?