మనకు ఇష్టమైన చిరుతిండ్లలో మొదటిది.. సమోసా. నలుగురు దోస్తులు ఒకచోట చేరితే కడక్ చాయ్కి తోడుగా వేడివేడి సమోసా ఉండాల్సిందే. మామూలుగా చిన్న సమోసా పది రూపాయల లోపు ఉంటుంది. పెద్ద సమోసా ఎక్కువలో ఎక్కువ యాభై రూపాయలు. ఢిల్లీలోని ‘మిస్టర్ చాయ్’ హోటల్లో మాత్రం ఒక్కో సమోసా ధర అక్షరాలా తొమ్మిది వందల రూపాయలు. ఆలూ, ఆనియన్, మటర్, డ్రైఫ్రూట్స్ సమోసాలతో పాటు చీజ్, నాన్వెజ్ సమోసాలను కూడా అందిస్తారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రయత్నించండి.
ఏం కావాలి?
సొరకాయ తురుము: ఒక కప్పు, క్యారెట్ తురుము: ఒక కప్పు, నెయ్యి: అర కప్పు, పాలు: రెండు కప్పులు, చక్కెర: ఒక కప్పు, యాలకులపొడి: అర టీస్పూన్, జీడిపప్పు, బాదం పప్పు: పావు కప్పు.
ఎలా వండాలి?
స్టవ్మీద పాన్పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి.. వేడయ్యాక జీడిపప్పు, బాదంపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క్యారెట్, సొరకాయ తురుము సన్నటి మంటపై ఐదు నిమిషాలపాటు వేయించాలి. బాగా వేగిన మిశ్రమంలో పాలు పోసి కలుపుతూ దగ్గరపడే వరకూ ఉడికించాలి. చక్కెర, యాలకుల పొడి వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి చివరగా వేయించిన బాదం, జీడిపప్పు చిలకరించి దించుకుంటే సొరకాయ క్యారెట్ హల్వా సిద్ధం.
ఒక్కో రెస్టారెంట్కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇండియన్, చైనీస్, జపనీస్.. ఇలా ఒక్కో హోటల్లో ఒక్కోరకం ఆహారం దొరుకుతుంది. కానీ వీటన్నిటినీ ఒకే చోట రుచి చూడాలనుకుంటే మాత్రం.. జూబ్లీహిల్స్లోని ‘ద జపనీస్ కనెక్ట్’కు వెళ్లాల్సిందే. పాన్ ఇండియా సినిమాలు అన్ని భాషల నటులతో ప్రేక్షకులను అలరించినట్టు.. పాన్ ఏషియన్ రెస్టారెంట్లు కూడా ఆసియాలోని అన్నిదేశాల రుచులనూ వడ్డిస్తున్నాయి. సమంతా, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ తారలు మెచ్చిన ఈ రెస్టారెంట్లో వెల్కమ్ డ్రింక్గా మూడు ఫ్లేవర్ల మాక్
టెయిల్స్తో విందు మొదలవుతుంది. భోజనంలో సుషీ, చాంగ్క్వింగ్ చికెన్, జాస్మిన్ రైస్ విత్ కున్పావ్ చికెన్, అబూరీ సాల్మన్, రెయిన్ బో రోల్ వంటి ఏషియన్ వంటకాలను వడ్డిస్తారు. ఇక స్వీట్స్, స్టార్టర్స్ సంగతి సరే సరి. ఇద్దరు వెళ్తే దాదాపుగా రూ.3000/- వరకూ బిల్లు అవుతుంది.
దీన్ని ‘తెల్ల క్యారెట్’ అనీ అంటారు. ఆకారంలో క్యారెట్లా ఉన్నా రంగు, రుచిలో పోలికే ఉండదు. దక్షిణాదిలో ముల్లంగి వాడకం ఎక్కువ. దీన్ని సాంబారు, సలాడ్స్, చట్నీలో వాడతారు. రుచికి కాస్త వెగటుగా ఉన్నా ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.
ముల్లంగిలోని పోషకాలు కాలేయం, జీర్ణ వ్యవస్థకు మంచి చేస్తాయి. ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరా చేసి రక్తాన్ని శుభ్రపరచడంలోనూ సాయపడతాయి. ముల్లంగి ఆకులకు కామెర్లను నివారించే ఔషధ గుణం ఉంది.
జీర్ణక్రియను మెరుగుపరిచి పైల్స్ నివారణకు సాయపడుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్స్కు విరుగుడుగా పనిచేస్తుంది. మూత్రంలో మంటను నివారించేందుకు సాయపడుతుంది. ముల్లంగి తురుమును పెరుగులో కలుపుకొని ఉప్పూకారం చిలకరించుకొని తిన్నా రుచిగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ముల్లంగి చక్కని ఆహారం. దీనిలోని పీచు పదార్థాలు, కార్బొహైడ్రేట్స్, నీరు ఊబకాయ నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చర్మ, శ్వాస సమస్యల నివారణకు, క్యాన్సర్ నియంత్రణకు సమర్థంగా పనిచేస్తుంది.
ఎరుపు, నలుపు రంగుల్లోనూ ముల్లంగి అందుబాటులో ఉంది. కాకపోతే ఈ కూరగాయ కొందరికి పడదు. ఆ తరహా అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండటమే మంచిది.
కొందరికి ఆ వాసన కూడా పడదు.
కూరగాయల మార్కెట్లో గుమ్మడికాయ కనిపిస్తే అస్సలు వదలొద్దని సలహా ఇస్తున్నది బాలీవుడ్ నటి భాగ్యశ్రీ. ఏడాది మొత్తం గుమ్మడి వంటకాలు తిన్నా ఏమాత్రం బోర్ కొట్టదని అంటున్నది. పనిలో పనిగా ఆరోగ్య ప్రయోజనాలూ వివరించింది. గుమ్మడికాయలో ఫైబర్ ఎక్కువ. దీంతో కంటి ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. థైరాయిడ్ రుగ్మతలను ఎదుర్కొనే సత్తా ఒక్క గుమ్మడికాయకే ఉంది. ఇందులోని విటమిన్స్, మినరల్స్ శరీరానికి పోషకాలు అందిస్తాయి. ఊబకాయానికి గుమ్మడి చక్కని పరిష్కారం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కూడా. ఇక గుమ్మడికాయతో సూప్లు, రుచికరమైన గ్రేవీలు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నో రకాల తీపి వంటకాలను కూడా వండుకోవచ్చు. సెకెండ్ ఇన్నింగ్స్లో తన విజయ రహస్యం గుమ్మడే అంటున్నది. నిజమే, ‘మైనే ప్యార్ కియా’ రోజుల్లో ఎంత గ్లామరస్గా ఉండేదో ఇప్పుడూ అలానే ఉంది భాగ్యశ్రీ.
పానీపూరీని ఉత్తరాదిన ‘గోల్గప్పా’ అంటారు. నిజానికి ఇది ఉత్తర భారతీయుల వంటకమే. అయినా మన రుచులను కూడా మేళవించి తయారు చేస్తారు. చాట్ వేడివేడిగా తినేందుకే
ఇష్టపడతాం. కానీ పానీపూరీ మసాలాకు ఐస్ జోడించి గోల్గప్పా షేక్ తయారు చేశాడో వ్యక్తి. foodie_blest అనే ఇన్స్టా హ్యాండిల్లో షేర్ చేయడం వల్ల అది కాస్తా వైరల్ అయిపోయి.. ట్రెండ్ అవుతున్నది.
భారతీయ ధర్మం భోజనాన్ని పవిత్ర కార్యంగా భావిస్తుంది. యజ్ఞంతో పోలుస్తుంది. పరధ్యానంగానో, ఒత్తిడి మధ్యో కాకుండా.. ఎరుకతో తినమంటుంది. వేడివేడిగా ఉన్న పదార్థాలను తినడమే మంచిది. శుభ్రంగా, అందంగా అలంకరించిన చోట భోజనం చేయడం ముఖ్యం. దీనివల్ల తిండిపై ఇష్టం పెరుగుతుంది. అందుకే, పూర్వం అరటాకు ముందు చక్కని ముగ్గులు వేసేవారు.
Fruits | మనం పండ్లు ఎందుకు తినాలి?
శారీరక, మానసిక ఆరోగ్యం పెంచుకోవాలా..? వీటిని నిత్యం తినండి!”
పల్లీలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!!”
మిల్లెట్స్ను ఎవరైనా తినొచ్చా..? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి..?”
ఏజ్ పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? అయితే, ఈ నాలుగు పండ్లను తప్పక తినండి!!”