మంచి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నిత్యం అన్ని పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకు మనం చేయాల్సిందల్లా మన ప్లేటులో వీటికి స్థానం కల్పించడమే. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు, వ్యాధులను తగ్గించుకునేందుకు మనం తినే ఆహారాలే ఔషధాలన్నది మరిచిపోవద్దు. మంచి ఆహారంతోపాటు మంచి అలవాట్లను అలవర్చుకోవడం కూడా చాలా అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో కూడా మనకు అందుబాటులో ఉన్న కొన్ని ఆహారాలతో మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు.. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఈ ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సీ, బీ-కాంప్లెక్స్, ఈ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల నరాలకు విశ్రాంతి లభిస్తుంది. సహజంగా నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
చక్కెర, ఆర్టిఫీషియల్ స్వీట్నర్లకు గొప్ప ప్రత్యామ్నాయం. ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బెల్లం తినడం వలన రోగ నిరోధకశక్తిని పెంచుకోవడంతోపాటు కాలేయం, రక్తం శుద్ధీకరణకు ఉపయోగపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్పగా ఉపయోగపడే ఆహారం. ఈ డ్రై ఫ్రూట్లో పొటాషియం, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెండ్లతోపాటు అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొబ్బరి నీరు, పచ్చి కొబ్బరి, పాలు లేదా దాని నూనెలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. కొబ్బరిలో మాంగనీస్, మెగ్నీషియం, రాగి, పొటాషియం వంటి ఖనిజాలు ఎన్నో దొరుకుతాయి. కొబ్బరిని ప్రతిరోజూ తినడం వల్ల సూక్ష్మపోషకాలు శరీరానికి అందుతాయి. కొబ్బరి నీరు యాంటీడిప్రెసెంట్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
వీటిని డిజర్ట్లతో కలిపి తీసుకోవచ్చు. నీటిలో నానబెట్టిగానీ, పచ్చివిగానీ తినొచ్చు. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం, వాల్నట్లు శక్తిని పెంచే ఆహారాలు. పిస్తాపప్పులు మెదడు, కళ్ల పనితీరును మెరుగుపరుస్తాయి. వేరుశెనగలు నిత్యం తినడం వల్ల ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి.