హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేసింది. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో 24 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరో నాలుగింటిని పాక్షికంగా వివిధ స్టేషన్ల మధ్య రద్దు చేసింది. దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాలు లాక్డౌన్, అదే తరహా నిబంధనలు అమలు చేస్తుండడంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సరైన ఆక్సుపెన్సీ లేకపోవడంతో రైల్వేశాఖ ట్రయిన్లను రద్దు చేస్తున్నది.