చెన్నై : ఎన్నికల కమీషన్కు మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. మీ కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని ఆక్షేపించింది. కొవిడ్ సెకండ్ వేవ్ రావడానికి ముమ్మాటికి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.. ఇకనైనా మే 2 న నిర్వహించే కౌంటింగ్ సందర్భంగానైనా కొవిడ్ ప్రోటోకాల్ను తయారు చేసి పక్కాగా అనుసరించేలా చూడాలని ఈసీని ఆదేశించింది. అలా జరుగనిపక్షంలో లెక్కింపు షెడ్యూల్ను ఆపివేయవలసి వస్తుందని హెచ్చరించింది.
వాస్తవానికి, తమిళనాడులోని కరూర్ అసెంబ్లీ సీటుపై లెక్కింపు కోసం దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ అసెంబ్లీ సీటుకు 77 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, అందువల్ల మే 2 న లెక్కింపు రోజున కొవిడ్ ప్రోటోకాల్ను ఇక్కడ పాటించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సనీబ్ బెనర్జీకి కోపం వచ్చింది. “ఎన్నికల ర్యాలీలు జరుగుతుండగా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? మీరు మరో గ్రహం మీద ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలియడం లేదా?ష అంటూ ఎన్నికల కమిషన్ను ప్రశ్నంచారు. ర్యాలీల సందర్భంగా కొవిడ్ ప్రోటోకాల్ను అమలుచేస్తున్నది కూడా పట్టించుకోలేదు ఎందుకని, సామాజిక దూరం లేకుండా ఎన్నికల ర్యాలీలు కొనసాగాయా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇలా పరిస్థితి దిగజారిందంటే దానికి మీదే బాధ్యత అని ఎందుకు అనకూడదు. మీ వల్లనే సెకండ్ వేవ్ వచ్చింది. ఈ పరిస్థితికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా? ఎన్నికల కమిషన్ అధికారులపై హత్య కేసును నమోదు చేయమంటారా? ష అంటూ చీఫ్ జస్టిస్ సనీబ్ బెనర్జీ ఈసీని ప్రశ్నించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 30 కి వాయిదా వేశారు.
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్లోని ఓ ఊరి కథ
సౌదీ నుంచి భారత్కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
భారతదేశానికి మద్దతు తెలిపిన జర్మనీ
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..