న్యూఢిల్లీ : కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుపుతున్న పోరులో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆదివారం భారతదేశానికి సంఘీభావం తెలిపారు. కొవిడ్-19 కేసులు అనేకంగాపెరుగడంతో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు అండగా నిలిచి ఆదుకునేందుకు అత్యవసర సహాయ లక్ష్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది.
కొవిడ్ -19 కారణంగా ఇబ్బందిపడుతున్న భారత ప్రజలకు నా సానుభూతిని తెలియ జేయాలనుకుంటున్నాను” అని ఏంజెలా మెర్కెల్ ఒక సందేశంలో పేర్కొన్నారు. దీనిని ట్విట్టర్లో ఆమె ప్రతినిధి స్టెఫెన్ సీబెర్ట్ షేర్ చేశారు. “మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారతదేశానికి సంఘీభావం తెలుపుతున్నాం. అలాగే అత్యవసరంగా మద్దతు మిషన్ను సిద్ధం చేస్తున్నాం” అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.
కొరోనావైరస్ వ్యాధి కేసులు, మరణాలు అధికంగా పెరుగుతున్నందున చాలా దేశాలు భారతదేశానికి మద్దతు ఇస్తామని ప్రకటించి సంఘీభావం వ్యక్తం చేశాయి. ఇటీవలనే కెనడా కూడా భారత్కు మద్దతు ఇచ్చింది. కెనడా మంత్రి అనితా ఆనంద్ భారతదేశానికి తన మద్దతును తెలియజేశారు. చాలా ఇబ్బందుల్లో ఉన్న భారత్కు పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఇతర అవసరమైన వస్తువులను అందించేందుకు సిద్ధమని చెప్పారు.
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఫ్లోరిడాలో బేబీ డైనోసార్ .. కెమెరాకు చిక్కిందంటున్న ఓ మహిళ.. వీడియో
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టుపై దాడి.. ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు హతం
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..