మన దేశంలో తొలిసారిగా రంగుల్లో టీవీ ప్రసారాలు 1982 ఏప్రిల్ నెలలో సరిగ్గా ఇదే రోజున ప్రారంభమయ్యాయి. అంటే 39 సంవత్సరాల క్రితం అన్నమాట. ఆ సమయంలో భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఆటలను దూరదర్శన్లో ప్రసారం చేశారు. ఈ క్రీడలు మన దేశంలో టీవీకి ఆదరణ పెంచింది.
మన దేశంలో టీవీ ప్రసారాలు 1959 లో ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లో టీవీ ఆలిండియా రేడియోలో భాగంగా ఉండేది. ప్రారంభ రోజుల్లో యునెస్కో సహాయంతో వారానికి రెండు రోజులు మాత్రమే గంట పాటు కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. 1965 లో దూరదర్శన్గా అవతరించింది. తొలుత టీవీ ప్రసారాలు గంటలపాటు కొనసాగేవి. మరికొన్ని రోజులకు గంటల నుంచి 24 గంటలకు చేరాయి.
రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ ప్రసారం చేయడంతో టీవీలకు విశేష ప్రాచుర్యం లభించిందని చెప్పాలి. ప్రస్తుతం వార్తల కోసమే కాకుండా పాటల కోసం, భక్తి కోసం, క్రీడల కోసం, చిన్నారుల కోసం ప్రత్యేక ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి.
డీఎన్ఏ ఆవిష్కరణ గురించి శాస్త్రవేత్తలు జేమ్స్ డీ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ రాసిన నేచర్ అనే పత్రికలో 1953 లో ప్రచురించబడింది. ఈ వ్యాసంలో వీరు డీఎన్ఏ నిర్మాణాన్ని వివరించారు. వాస్తవానికి, తల్లిదండ్రుల వంశపారంపర్య లక్షణాలను తరువాతి తరానికి తీసుకువచ్చే అంశమే డీఎన్ఏ. ఈ శాస్త్రవేత్తలు ఇద్దరికీ 1962 లో నోబెల్ బహుమతి లభించింది. వాట్సన్, క్రిక్ సృష్టించిన డీఎన్ఏ మోడల్ ప్రస్తుతం లండన్లోని సైన్స్ మ్యూజియంలో ఉన్నది.
2018: అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు 16 ఏండ్ల జీవిత ఖైదు విధింపు
2015: నేపాల్ రాజధాని ఖాట్మండుకు సమీపంలో భూకంపం, 8 వేలకు పైగా ప్రజలు దుర్మరణం
2010: ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ను ఓడించి టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్
1989: ఇథియోపియాలో ఎన్సెఫాలిటిస్తో 20 వేల మందికి పైగా మృతి
1983: రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వివాదాస్పద డైరీని ముద్రించడం ప్రారంభించిన జర్మన్ మ్యాగజైన్ ‘స్టెర్న్’
1980: టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయం నుండి 53 మంది బందీలను విడిపించేందుకు రహస్య ఆపరేషన్ను ప్రారంభించిన యుఎస్ మిలటరీ
1968 : ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ కన్నుమూత
1905: దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులకు ఓటు హక్కు
1809: అమృత్సర్ ఒప్పందంపై సంతకం చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ, పంజాబ్ సిక్కు పాలకుడు రంజిత్ సింగ్